టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ యాక్సిడెంట్ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద ఆయన కాన్వాయ్ కు భారీ యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ లోని 6 కార్లు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లలోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది.
ప్రమాదంలో రేవంత్ కాన్వాయ్ తో పాటు రిపోర్టర్ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో హత్ సే హత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రి కేటీఆర్ ఇలాక సిరిసిల్లాలో పాదయాత్ర చేయనున్నారు.