ప్రభాస్ హీరోయిన్ కు పెళ్లయిపోయింది

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో కెరీర్ సూపర్ హిట్ అందుకున్న రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా రిచా, జో ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. స్నేహితులు, బంధువుల మధ్య అట్టహాసంగా…

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో కెరీర్ సూపర్ హిట్ అందుకున్న రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా రిచా, జో ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. స్నేహితులు, బంధువుల మధ్య అట్టహాసంగా జరిగింది రిచా పెళ్లి.

తన ప్రేమ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే బయటపెట్టింది రిచా గంగోపాధ్యాయ. తను చదువుతున్న బిజినెస్ స్కూల్ లో జో పరిచయం అయ్యాడని, రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నామని ఫొటో పెట్టి మరీ బయటపెట్టింది. అలా ప్రకటించిన ఇన్నాళ్లకు రిచా-జో పెళ్లితో ఒక్కటయ్యారు.

శేఖర్ కమ్ముల డైరక్ట్ చేసిన లీడర్ సినిమాతో హీరోయిన్ గా మారింది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, నాగార్జున లాంటి హీరోల సరసన నటించింది. పనిలోపనిగా తమిళ్ లో కూడా 2 సినిమాలు చేసింది. అయితే భాయ్ సినిమా ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

భాయ్ డిజాస్టర్ తర్వాత కొన్నాళ్లు సినిమాలు ఆపేసి ఉన్నత చదువులు చదువుకోవాలని భావించింది రిచా. అందులో భాగంగానే అమెరికా వెళ్లిన ఆమె, తన సహ-విద్యార్థి జోతో ప్రేమలో పడింది. ఇప్పుడిలా పెళ్లి కూడా చేసుకుంది.