రాజ్ తరుణ్ ‘టర్కీష్’ ప్రేమకథ

హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' విడుదల దగ్గరకు వస్తోంది. ఈనెల 25న విడుదల. ఈ నేపథ్యంలో సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. మంచి ఫీల్ గుడ్ పాటలు,…

హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' విడుదల దగ్గరకు వస్తోంది. ఈనెల 25న విడుదల. ఈ నేపథ్యంలో సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. మంచి ఫీల్ గుడ్ పాటలు, నాలుగు మాంచి డైలాగులు, ఓ మాంచి ప్రేమకథను చూడబోతున్నారనే భావనను కల్పించే సన్నివేశాలు కలిపితే, ఇద్దరి లోకం ఒకటే ట్రయిలర్. 

ఓ టర్కిష్ సినిమాను రైట్స్ తీసుకుని మరీ రీమేక్ చేస్తున్నారు నిర్మాత శిరీష్, సమర్పకులు దిల్ రాజు. హక్కులు కొనుగోలు చేసి మరీ రీమేక్ చేస్తున్నారంటే, అందులో ఎంతో కొంత విషయం లేకుండా వుండదని నమ్మవచ్చు. ఆ నమ్మకం ట్రయిలర్ లో కొంత వరకు కనిపిస్తోంది. రాజ్ తరుణ్, షాలినీ పాండేల మద్య కెమిస్ట్రీ తెరమీద అందంగా కనిపిస్తుందని ట్రయిలర్ భరోసా ఇస్తోంది. 

మిక్కీ ఎప్పుడూ పాటల విషయంలో డిస్సపాయింట్ చేయరు. ట్రయిలర్ లో వినిపించిన రెండు పాటలు కూడా సినిమాకు ప్లస్ అవుతాయని అనిపిస్తోంది. రాజ్ తరుణ్ కు ఎందుకో తెలియదు. ఆ తరహా కళ్లజోడు అంటే ఇష్టం. ఆఫ్ ది స్క్రీన్ కూడా అలాంటి కళ్లజోడు ఎక్కువగా వాడుతుంటాడు. కానీ అది అతగాడికి స్క్రీన్ మీద అంత యూత్ ఫుల్ లుక్ ఇస్తోందా? అన్నదే చిన్న అనుమానం.