మొన్న మహేష్.. ఈసారి కాజల్ వంతు

సెలబ్రిటీలు, స్టార్స్ మైనపు విగ్రహాలు వరుసగా కొలువుదీరుతున్నాయి. మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో.. కొత్తగా బ్యాంకాక్, సింగపూర్ లో బ్రాంచీలు తెరిచింది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో భాగంగా ఇప్పటికే…

సెలబ్రిటీలు, స్టార్స్ మైనపు విగ్రహాలు వరుసగా కొలువుదీరుతున్నాయి. మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో.. కొత్తగా బ్యాంకాక్, సింగపూర్ లో బ్రాంచీలు తెరిచింది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో భాగంగా ఇప్పటికే సింగపూర్ బ్రాంచ్ లో మహేష్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది.

అవును.. త్వరలోనే కాజల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేయబోతున్నారు. ఈ మేరకు మేడమ్ టుస్సాడ్స్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్, ఇండియా వచ్చి కాజల్ కొలతలు తీసుకెళ్లారు. ఫిబ్రవరి 5 నాటికి కాజల్ మైనపు ప్రతిమను మ్యూజియంలో ఏర్పాటుచేయబోతున్నారు.

మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ మాల్ లో ఉంచారు. తన విగ్రహావిష్కరణకు కుటుంబంతో పాటు వచ్చాడు మహేష్. తర్వాత ఫ్యాన్స్ అంతా ఆ విగ్రహంతో సెల్ఫీలు కూడా దిగారు. కాజల్ విషయంలో ఇలాంటి వెసులుబాటు లేదు. ఆమె విగ్రహాన్ని నేరుగా సింగపూర్ బ్రాంచ్ లోనే పెడతారు. కాజల్ అక్కడికెళ్లి, తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్ లో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.