పవన్‌ కల్యాణ్‌ ఒక శాడిస్టు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడే మాటలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ అన్నారు. Advertisement భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం…

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడే మాటలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ అన్నారు.

భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే.  పవన్‌కు మానసిక జబ్బు ఉందని.. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీనివాస్‌ మండిపడ్డారు. పిచ్చి కల్యాణ్‌ నీకు బుర్ర ఉందా లేదా పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు.

‘సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్‌ గుర్తించడట. పవన్‌ నీకు అసలు రాజ్యాంగం గురించి తెలుసా. ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 51 శాతం ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిగా అంగీకరించనంటావా. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను దారుణంగా అవమానించావు. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పు’ అని పవన్‌ కల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు.

‘నీకు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పవిత్రులు. వైఎస్సార్సీపీలో గెలిచిన వారు అపవిత్రులా’ అని ప్రశ్నించారు.

దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పవన్‌ నీకేమైనా మైండ్ దొబ్బిందా’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.