త్రివిక్రమ్ ను వద్దంటున్న దిల్ రాజు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ సినిమా రీమేక్ చేయాలని సంకల్పించారు నిర్మాత దిల్ రాజు. అయితే రైట్స్ తన దగ్గర వున్నాయి కాబట్టి, తనకూ భాగస్వామ్యం అన్నారు బోనీ కపూర్. దాంతో…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ సినిమా రీమేక్ చేయాలని సంకల్పించారు నిర్మాత దిల్ రాజు. అయితే రైట్స్ తన దగ్గర వున్నాయి కాబట్టి, తనకూ భాగస్వామ్యం అన్నారు బోనీ కపూర్. దాంతో ఇద్దరు నిర్మాతలు అయ్యారు.

పవన్ కళ్యాణ్ దగ్గరకు అసలు ఈ ప్రాజెక్టు తీసుకెళ్లడం, ఆయన ఓకె అనడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన సినిమాలు చేసే హారిక హాసిని బ్యానర్. దాంతో వాళ్లూ భాగస్వాములయ్యారు.

అయితే ఇప్పుడు కథ మారుతోందని తెలుస్తోంది. ఎందుకంటే హారిక హాసిని భాగస్వామ్యం వుంటే త్రివిక్రమ్ కు మొహమాటం తప్పదు. అసలే పవన్ కళ్యాణ్ తో స్నేహం. దీంతో ఇప్పుడు పింక్ తెలుగు స్క్రిప్ట్ ను తయారుచేయాల్సిన బాధ్యత తివిక్రమ్ మీద పడుతుంది. ఆల్ రెడీ పడిందని వార్తలు వున్నాయి. 

నిర్మాత దిల్ రాజు ఆలోచనలు వేరుగావున్నట్లు తెలుస్తోంది. తన ఆస్థాన దర్శకుడు, పింక్ రీమేక్ దర్శకుడు అయిన వేణు శ్రీరామ్ చేతనే స్క్రిప్ట్ వర్క్ చేయించాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితేనే తనకు కంఫర్ట్ గా వుంటుందని ఆయన భావిస్తున్నట్లు బోగట్టా. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అయితే దిల్ రాజు చేయి పెట్టడానికి కానీ, ఇన్ పుట్స్ ఇవ్వడానికి కానీ అవకాశం వుండదు.

అయితే ఎన్టీఆర్ సినిమాను ముందు పెట్టుకున్న త్రివిక్రమ్ కూడా పింక్ స్క్రిప్ట్ చేసేంత టైమ్ లేదు.అందువల్ల టోటల్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఇటు హారిక హాసిని, అటు త్రివిక్రమ్ ఇద్దరూ భావిస్తున్నట్లు బోగట్టా. 

కానీ ఒకటే సమస్య త్రివిక్రమ్ తప్పుకుంటే పవన్ మనసు ఎలా మారుతుందో తెలియదు. పైగా త్రివిక్రమ్ లేకుండా పవన్ తో సినిమా చేయడం అంటే దిల్ రాజుకు అంత వీజీ కూడా కాదు. ఏమైనా పింక్ రీమేక్ కు ఇంకా చాలా చాలా ట్విస్ట్ లు వుంటాయని వార్తలు వినవస్తున్నాయి.