అభిషేక్ నామాకు అంత కోపం ఎందుకు?

ఆ వందమంది ఎవరు అవుతారు అన్నది పక్కన పెడితే.. వంద మందికి తలా లక్ష రూపాయలు ఇవ్వడం అన్న ఆలోచన కచ్చితంగా మంచిదే. ఓ పర్సన్ కు లేదా ఓ కుటుంబానికి లక్షరూపాయలు అంటే…

ఆ వందమంది ఎవరు అవుతారు అన్నది పక్కన పెడితే.. వంద మందికి తలా లక్ష రూపాయలు ఇవ్వడం అన్న ఆలోచన కచ్చితంగా మంచిదే. ఓ పర్సన్ కు లేదా ఓ కుటుంబానికి లక్షరూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. 

ఆ సంగతి అలా వుంచితే, ఈ ఖుషీ మూమెంట్ ను అనౌన్స్ చేయగానే డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా వేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అంతే కాదు ఆయన ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వూ కూడా అంతే సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? జనాలకు తెలియాలని అభిషేక్ నామా కు ఫోన్ చేస్తే.. ముందుగా పెద్దగా ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు.. ఏదో మాట్లాడా.. ఏదో రాసారు వదిలేయండి అన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పచ్చుగా.. అని అడిగితే..

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదలకు తాను, ఆసియన్ సునీల్ ఎంతో శ్రమించామని, ఆసియన్ సునీల్ లాంటి పెద్ద వ్యక్తి స్వయంగా ఆ సినిమా ఫైనాన్షియర్ ఇంటికి వచ్చి, నిర్మాత ఇచ్చిన పేపర్ల మీద తాను గ్యారంటీ సంతకం పెట్టి సినిమా విడుదలకు సహకరించారని వివరించారు. కానీ విజయ్ దేవరకొండ ఏం చేసారో, నిర్మాతకు తెలుసు అన్నారు.

దాదాపు ఎనిమిది కోట్లు ఆ సినిమా వల్ల నష్టపోయాక, ఇక తీర్చలేనని నిర్మాత కేఎస్ రామారావు చేతులు ఎత్తేసాక, విజయ్ తండ్రిని కలిసి ఓ సినిమాకు డేట్ లు ఇస్తే బాగుంటుందని సూచించామన్నారు. దానికి ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా హీరో అయిపోయారని, త్రివిక్రమ్ ను లేదా సుకుమార్ లాంటి టాప్ డైరక్టర్లను తెస్తే ఆలోచిద్దామని అన్నారన్నారు.

అసలు హీరోల విషయంలో తమ నిర్మాతలే తప్పు చేస్తున్నారని, వాస్తవాలు చెబితే హీరోలకు పరిస్థితులు అర్థం అవుతాయని, కానీ అలా చెప్పకుండా, వారినికి వేరే లోకంలో వుంచుతున్నారని అభిషేక్ నామా అన్నారు.

ఇదిలా వుంటే నిన్నటికి నిన్న అభిషేక్ నామా ట్వీట్ వెనుక వేరే సంగతి వుందని, హీరో సన్నిహితుల ఎవరితోనో ఫోన్ లో మాట్లాడితే, వాళ్లు మాట్లాడిన మాటలు అభిషేక్ నామాను బాధపెట్టాయని, అందుకే అలా ట్వీట్ వేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.