టీడీపీ గుండెల్లో బాంబు లాంట్ న్యూస్… ?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా ఉంది అంటే వేరేగా సర్వేలు చేసి చెప్పాల్సిన శ్రమ అయితే లేదు అంటారు. మూడేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడినది లగాయితూ వరసబెట్టి ఏ ఎన్నిక…

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా ఉంది అంటే వేరేగా సర్వేలు చేసి చెప్పాల్సిన శ్రమ అయితే లేదు అంటారు. మూడేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడినది లగాయితూ వరసబెట్టి ఏ ఎన్నిక జరిగినా టీడీపీ పరాజయం పాలు అవుతోంది.

దాంతో టీడీపీ జాతకం ఏంటి అన్నది అందరికీ తెలుసు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలీ అంటే టీడీపీకి 2024 ఎన్నికలే లాస్ట్ చాన్స్ ట. ఆ ఎన్నికలలో ఓడి టీడీపీ  ఏపీ రాజకీయ వేదిక మీద అంతర్ధానం అవడం ఖాయమని కూడా ఆయన అంటున్నారు.

అంతే కాదు టీడీపీ అధినాయకత్వం అదిరిపోయే న్యూస్ ని కూడా ఆయన ఒకటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది పెద్ద నాయకులు వైసీపీతో చర్చలు జరుపుతున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఇది ఒక విధంగా టీడీపీ పెద్దలకు బాంబు  లాంటి వార్తగానే చూడాలి.

టీడీపీ తమ్ముళ్లు వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అంటున్నారు. మరి ఏ జిల్లా నుంచి ఈ నేతలు టీడీపీని వీడుతున్నారు, ఆ వివరాలు ఏంటి అన్నది విజయసాయిరెడ్డి ఈ రోజుకు బయటపెట్టకపోయినా టీడీపీ పని అయిపోయింది అని మాత్రం అంటున్నారు. ఆయన చెప్పినట్లుగా జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో మరో మారు ప్రకంపనలు చెలరేగడం ఖాయమే అనుకోవాలి.