ఛీ..బ‌తుకు చెడాః ప‌వ‌న్ మ‌రీ ఇంత అలుసా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రీ ఇంత అలుస‌య్యారా? చివ‌రికి ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ హిత‌వు చెప్పే ప‌రిస్థితికి దిగ‌జారారా? సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ప‌వ‌న్‌ను ఉద్దేశించి కేఏ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రీ ఇంత అలుస‌య్యారా? చివ‌రికి ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ హిత‌వు చెప్పే ప‌రిస్థితికి దిగ‌జారారా? సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ప‌వ‌న్‌ను ఉద్దేశించి కేఏ పాల్ సెటైర్స్ విసిరారు. వీటిని తీసుకుని, ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న గురించి తాను అన‌డాన్ని పోల్చుతూ దిమ్మ‌తిరిగే కామెంట్స్ చేస్తుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. త‌న‌ను మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించ‌డాన్ని తీవ్ర అవ‌మానంగా ప‌వ‌న్ భావించారు.

శ్రీకాకుళం స‌భ‌లో రోజాను ఉద్దేశించి ప‌వ‌న్ ఏమ‌న్నారంటే… “డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతున్నారు. చివ‌ర‌కు ఆమెతోనూ తిట్టించుకుంటున్నా. చివ‌ర‌కు నువ్వు కూడానా. ఛీ…నా బ‌తుకు చెడ” అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యంగ్యంగా విమ‌ర్శించారు. ప‌వ‌న్ గురించి కేఏ పాల్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

మిమ్మ‌ల్ని(జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని) న‌మ్ముకుని రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఓట్లు వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే చంద్ర‌బాబుతో క‌లిసిన‌ట్టు ప‌వ‌న్ చెబుతున్నార‌ని పాల్ చెప్పుకొచ్చారు. ఒక‌వేళ వైసీపీ వాళ్లు మంత్రి ప‌ద‌వి ఇస్తే పొత్తు పెట్టుకుంటావు క‌దా? అని ప‌వ‌న్‌ను పాల్ నిల‌దీశారు. రాజ్య‌స‌భ సీటుతో పాటు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇస్తామంటే బీజేపీలో చేరిపోతావు క‌దా? అని ప్ర‌శ్నించారు. సీఎం కాన‌ని, ఫెయిల్డ్ పొలిటీషియ‌న్ అని ప‌వ‌నే ఓపన్‌గా చెబుతున్నాడ‌న్నారు. చంద్ర‌బాబు ప‌ద‌వి ఇస్తున్నాడు కాబ‌ట్టే ఆయ‌న‌తో వెళ్తాన‌ని, గ‌త‌సారి ఓట్లు వేయ‌లేదు, ఈ ద‌ఫా వేయ‌ర‌ని, నేను మిమ్మ‌ల్ని న‌మ్ముకుని దిగాను, అందుకే మూవీల‌కు తిరిగి వెళ్లిపోయాన‌ని ప‌వ‌న్ అన్నార‌ని మ‌రోసారి పాల్ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇలాంటి నాయ‌కుడి కోసం ఆ రెండుమూడు శాతం ఓట్ల‌ను ఎందుకు వృథా చేసుకుంటున్నార‌ని కాపుల‌ను కేఏ పాల్ ప్ర‌శ్నించారు. ఓట్లు ఎందుకు చీల్చుతార‌ని నిల‌దీశారు. లోకేశ్‌ను కాద‌ని నిన్ను ముఖ్య‌మంత్రిని చేస్తాడా? అని ప‌వ‌న్‌ను నిల‌దీశారు. మోసం చేయ‌డానికే చంద్ర‌బాబు మాయ‌మాట‌లు చెబుతున్నార‌ని కేఏ పాల్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌న‌ల్ని మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌చ్చా? అని ప్ర‌శ్నించారు. క‌నీస జ్ఞానం వుండాల‌నే క‌దా మ‌న‌కు దేవుడు తెలివితేట‌లు ఇచ్చాడు.. వాడ‌ద్దా? అని ప‌వ‌న్‌ను దెప్పి పొడిచారు.  లైఫ్‌లో నువ్వు ముఖ్య‌మంత్రి కాలేవ‌ని, ఎవ‌రూ చేయ‌ర‌ని ప‌వ‌న్‌కు జ్ఞానోద‌యం చేసేందుకు పాల్ ప్ర‌య‌త్నించారు. ప్ర‌జ‌లు తెలివైన వాళ్లని అంతిమంగా కేఏ పాల్ తేల్చి చెప్పారు.

చివ‌రికి ప‌వ‌న్ రాజ‌కీయ బ‌తుకు కేఏ పాల్‌తో బుద్ధి చెప్పించుకునే ప‌రిస్థితికి దిగ‌జారింద‌ని నెటిజ‌న్లు వ్యంగ్య కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఔను, ప‌వ‌న్ అన్న‌ట్టు ఆయ‌న బ‌తుకు చెడ‌…ఛీ, ఎంత‌కు ప‌త‌న‌మైంది అని వెట‌క‌రిస్తున్నారు. రోజురోజుకూ ప‌వ‌న్‌పై కేఏ పాల్ చెల‌రేగిపోతున్నారు. అయితే ఆయ‌న విమ‌ర్శ‌ల్లో లాజిక్ క‌నిపిస్తుండ‌డంతో ఆక‌ట్టుకుంటున్నాయి.