జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైయస్ జగన్ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో ఓ కామెడీ పీస్ అని… వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ లేదని విమర్శించారు. పవన్ చేసే కామెడీ చూడటానికే జనం సభలకు వెళ్తున్నారన్నారు.
పవన్ కల్యాణ్ ఓ పిరికి పంద అని, పిరికివాడే పదేపదే ధైర్యవంతుడనని అంటుంటాడని ఎద్దేవా చేశారు. పవన్ లాంటి పిరికివాడిని రాజకీయాల్లో ఇంత వరకు చూడలేదన్నారు. ఆయన ఇంత వరకు ఏ పోరాటం చేశాడో చెప్పాలని డిమాండు చేశారు. పవన్కు ఆరాటం తప్ప.. పోరాటం లేదని, ఆయన మాటలకు అర్థాలే వేరన్నారు. పవన్కు గ్యారంటీ ఇస్తే సింగిల్గా పోటీ చేస్తాడట.. ఇలాంటి మాటలు చెప్పాడని సిగ్గుండాలని మండిపడ్డారు.
నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటారు, కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పవన్ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయే తప్పా మరోకటి కాదన్నారు. పవన్ చంద్రబాబు వేసిన ఫ్యాకేజీ బాటలో వెళ్తున్నారని అది యువత గుర్తించాలని సూచించారు. పిరికి సన్నాసులు దమ్ము, ధైర్యం లేని వ్యకులు సింగిల్ గా వచ్చిన వీరమరణంమే.. కలిసొచ్చినా రాజకీయంగా మరణమే అని విమర్శించారు.