పరువు తీసేసారు

ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు కానీ పరువు తీయమని అనలేదు. కానీ మన సినిమా ఫ్యాన్స్ అలా కాదు. హద్దు మీరి ప్రవర్తించి విదేశంలో మన…

ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు కానీ పరువు తీయమని అనలేదు. కానీ మన సినిమా ఫ్యాన్స్ అలా కాదు. హద్దు మీరి ప్రవర్తించి విదేశంలో మన పరువు తీస్తున్నారు. 

కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటూ అరెస్ట్ ల వరకు వెళ్తున్నారు. లేటెస్ట్ గా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శన సందర్భంగా అమెరికాలో థియేటర్ లో సినిమా ఆపేసి, జనాలను బయటకు పంపారు. థియేటర్లో జై బాలయ్య అంటూ నానా గోల చేయడం, ఇష్టం వచ్చినట్లు కాగితాలు చింపి ఎగరేయడమే ఇందుకు కారణం.

ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులకు థియేటర్ ఇంకా పోలీస్ అధికారులు ఫుల్ గా క్లాస్ పీకుతున్న వీడియో అది. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు ప్రదర్శించినా ఇలాంటి పరిస్థితి లేదని, ఇది తొలిసారని క్లారిటీగా క్లాస్ పీకారు.

కోవిడ్ తరువాత వేలాది తెలుగు కుర్రాళ్లు అమెరికాకు చదువులకు చేరారు. దీనివల్ల అమెరికాలో తెలుగు సినిమాల కలెక్షన్లు పెరిగాయి అని సంతోషించాలో, లేదా ఇలాంటి ఫ్యాన్స్ కుమ్ములాటలు, థియేటర్ గడబిడలు పెరిగాయని బాధపడాలో మరి.