డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ సంచ‌ల‌న కామెంట్స్‌…తీవ్ర దుమారం

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తాజాగా ఉచిత విద్య‌, రిజ‌ర్వేష‌న్లు, ఓటు హ‌క్కుపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ…

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తాజాగా ఉచిత విద్య‌, రిజ‌ర్వేష‌న్లు, ఓటు హ‌క్కుపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ పోడ్‌కాస్ట్ ఆడియోల‌తో పూరీ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న దేశంలో పేద పిల్ల‌ల‌కు ఉచిత విద్య ఉండ‌కూడ‌ద‌ని, కులాన్ని బ‌ట్టి రిజ‌ర్వేష‌న్లు ఉండ‌కూడ‌ద‌ని, పేద‌ల‌కు, నిర‌క్ష‌రాస్యుల‌కు ఓటు హ‌క్కు తీసేయాల‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను తెర‌పైకి తెచ్చి ఉద‌హ‌రిస్తూ త‌న‌దైన వాయిస్‌ను గ‌ట్టిగా వినిపించారు. ఆయ‌న మాటల్లో ఆవేద‌న‌, స‌మాజ స్థితిగ‌తుల ప‌ట్ల ఆగ్ర‌హం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.  

“అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్ట‌డం త‌ప్పు కాదు. పేదోడిగా చావ‌డ‌మే త‌ప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. 

గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావ్ అని అడగాలి” అంటూ పూరీ నిల‌దీశారు.

“నీకు రేషన్ కార్డ్ కావాలంటే ఓటు హ‌క్కు కోల్పోతావ్ అని చెప్పాలి. చెప్పే వాడికి ఏది అవసరమో అదే తీసుకుంటారు. అప్పుడు నిజంగా కష్టంలో ఉన్నవాడు వైట్ కార్డ్ తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు దాని కోసం కష్టపడతాడు.  రిజర్వే షన్లు కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు.. పేదోడు ఏ కులంలో ఉన్నా.. సపోర్ట్ చేయాలి. వాళ్ల పిల్లలు చదువుకునేలా చేయాలి.  

నిరక్షరాస్యులకు ఓటింగ్ తీసేయాలి. ఓటు వేయాలి అంటే క‌నీస విద్యార్హ‌త‌ ఉండాలి. పుట్టాం కదా గుద్దేస్తాం అంటే.. కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి” అని ఘాటుగా స్పందిచారు.

“ప్రభుత్వాలని, నాయ‌కుల్ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్ట పడుతుంది లేదంటే చస్తుంది. నీ జాతిని తిడితే నీకు కోపం వస్తుంది కదూ.. మరి అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా?  కష్టపడు.. నీ జాతి తలెత్తుకునేలా చేయి.. మా జాతికి రిజర్వేషన్లు వద్దు.. వేరే వాడికి ఇవ్వండి అని చెప్పేలా ఉందాం. అప్పుడు మారుతుంది ఇండియా. కాళ్లు చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు” అని సంచ‌‌ల‌న కామెంట్స్ చేశారు.

పూరీ కామెంట్స్‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. దళిత సంఘాలు మాత్రం పూరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేష‌న్లు, రేష‌న్‌కార్డులు, నిర‌క్ష‌రాస్యుల‌కు ఓటు తీసేయాల‌న‌డంపై ఆ సంఘాలు మండిప‌డుతున్నాయి. సమాజం పట్ల బాధ్యతగా  మాట్లాడాల్సిన   దర్శకుడు పూరీ… ఇలాంటి బాధ్య‌తా రాహిత్య మాట‌లు మాట్లాడ్డం ఏంట‌ని ద‌ళిత సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.  

ఇదే స‌మ‌యంలో పూరీ చాలా బాగా చెప్పార‌నే అభిప్రాయాలు కూడా పెద్ద సంఖ్య‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పూరీ మాట్లాడిన దాంట్లో త‌ప్పేంట‌ని కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇండియా బాగు ప‌డాలంటే పూరీ చెప్పిన‌ట్టే చేయాల‌నే వాళ్ల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగానే ఉంది. మొత్తానికి పూరీ వ్యాఖ్య‌లు మాత్రం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. 

ఎవరినీ వదిలి పెట్టను

అస‌లు ఈ సంవ‌త్స‌రం క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా?