మరో సినిమా పూర్తి చేసిన ప్రభాస్

చకచకా సినిమాలు ప్రకటించడమే కాదు, అంతే వేగంగా సినిమాలు పూర్తిచేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్, వీటిలో ఓ సినిమాను పూర్తిచేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో…

చకచకా సినిమాలు ప్రకటించడమే కాదు, అంతే వేగంగా సినిమాలు పూర్తిచేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్, వీటిలో ఓ సినిమాను పూర్తిచేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశాడు.

రామాయణం ఇతివృత్తంగా వస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరోయిన్ కృతి సనన్ పార్ట్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రభాస్ కూడా తన పార్ట్ కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా యూనిట్ కేక్ కట్ చేసి, పార్టీ చేసుకుంది.

తాజా షెడ్యూల్ తో ఆదిపురుష్ సినిమా దాదాపు 80శాతం పూర్తయింది. ఈ నెలాఖరుకు మిగతా భాగం షూటింగ్ కూడా పూర్తిచేస్తారు. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ ఎక్కువ. దానికి కనీసం 7 నెలలు టైమ్ పడుతుంది. అలా అన్ని పనులు పూర్తిచేసి, వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఆదిపురుష్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. ఆగస్ట్ లో ఆదిపురుష్ వస్తోంది. సో.. 2022లో ప్రభాస్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయన్నమాట. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ రావణుడిగా కనిపించబోతున్నారు.

ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ప్రాజెక్ట్-కె కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తూనే, త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కెను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్.