విశాఖ జనసేన లాంగ్‌ మార్చ్‌కు గంటా షాక్‌!

జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టిడిపి అదినేత ఆదేశాల ప్రకారం హాజరు కావల్సిన ముగ్గురు నేతలలో ఒకరు గైర్ హాజరు అయినట్లుగా ఉంది. Advertisement మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు,గంటా శ్రీనివాసరావులు…

జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టిడిపి అదినేత ఆదేశాల ప్రకారం హాజరు కావల్సిన ముగ్గురు నేతలలో ఒకరు గైర్ హాజరు అయినట్లుగా ఉంది.

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు,గంటా శ్రీనివాసరావులు జనసేనకు సంఘీభావంగా హాజరు అవుతారని టిడిపి ప్రకటించింది. అయితే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరై సభలో ప్రసంగించారు. కాని గంటా శ్రీనివాసరావు మాత్రం రాలేదు.

గత కొంతకాలంగా గంటాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేదో, లేక రాజకీయ కారణాలతో సభలో పాల్గొనలేదో కాని మొత్తం మీద రాలేదు.

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఆయన ప్రాతినిద్యం వహిస్తున్నారు.ఇసుక సమస్యపై పవన్ కళ్యాణ్ ఈ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.