పరుశురామ్ కు నో అన్న పవన్?

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, లాభాల్లో మాంచి వాటా అందుకుని, ఫుల్ హ్యపీ అయిన దర్శకుడు పరుశురామ్ కు, ఆ తరువాత మాత్రం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అయిపోతోంది. మహేష్ బాబు…

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, లాభాల్లో మాంచి వాటా అందుకుని, ఫుల్ హ్యపీ అయిన దర్శకుడు పరుశురామ్ కు, ఆ తరువాత మాత్రం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అయిపోతోంది. మహేష్ బాబు అనుకున్నారు. కానీ కాలేదు. ఇంకెవరైనా అని ట్రయ్ చేసారు. కాలేదు. నిన్ననో మొన్ననో వెళ్లి ప్రభాస్ కోసం యువి వాళ్లకు కథ చెప్పారు. కథ ఇంకా ప్రభాస్ దాకా వెళ్లలేదు. యువి సంస్థ అధినేతలు మాత్రం విన్నారని బోగట్టా.

ఇదిలావుంటే ఈ మధ్యన పరుశురామ్ ప్రమేయం లేకుండానే ఆయన పేరు వీటో అయిపోయిన విషయం ఒకటి తెలిసింది. తమిళంలో హిట్ అయిన పింక్ సినిమాను నిర్మాత దిల్ రాజు-హారిక హాసిని సంస్థ కలిసి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ తో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం డైరక్టర్ ను వెదుకుతున్నారు. చాలామంది అనుకున్నట్లు త్రివిక్రమ్ నో, వేణు శ్రీరామ్ నో చేయబోవటం లేదు. యంగ్ డైరక్టర్ కోసం వెదుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పరుశురామ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అంగీకారం కావాలి కనుక, ఆయనకు చెప్పారట నిర్మాతలు. దానికి పవన్ కళ్యాణ్ నో అనేసినట్లు బోగట్టా.

ఆయన వద్దు మరెవరినైనా చూడండి అని పవన్ అన్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. మరి పవన్ ఎందుకు నో అన్నారో? ఆయన అభిమతమేమిటో తెలియదు. 

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..