సాయిధరమ్ హెల్త్ అప్ డేట్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ ఇప్పుడెలా వుంది? అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆయన పూర్తిగా తేరుకున్నారా? ఎందుకు సాయి ధరమ్ ఫోటొలు ఏవీ బయటకు రావడం లేదు. నిజంగా…

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ ఇప్పుడెలా వుంది? అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆయన పూర్తిగా తేరుకున్నారా? ఎందుకు సాయి ధరమ్ ఫోటొలు ఏవీ బయటకు రావడం లేదు. నిజంగా షాక్ నుంచి బయటకు వచ్చేసారా? ఇలాంటి అనేక సందేహాలు వున్నాయి.  

ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాడని వార్తలు బయటకు వచ్చిన తరువాత మెగాస్టార్, పవర్ స్టార్ ట్వీట్ లు వేయడం తప్ప మరో అప్ డేట్ లేదు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ వెళ్లి చేతిలో చెయ్యి వేసిన చేతుల ఫొటో తప్ప మరోటి వదలలేదు. అప్పుడు కూడా ఫ్యాన్స్, చేతులు కాదు మొహం చూపించండి అంటూ కామెంట్లు వేసారు.

సాయి ధరమ్ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఆయన దాదాపుగా కోలుకున్నారు. లేచి కూర్చుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన ఫిజిక్ మాత్రం బాగా తగ్గిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎంత సన్నగా వుండేవారో అంత సన్నంగా అయిపోయారు. ప్రమాదానికి ముందు సాయి తేజ్ బాగా లావు అయిన సంగతి, తగ్గే ప్రయత్నాలు తరచు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మాత్రం ఆయన చాలా అంటే చాలా సన్నబడిపోయారు. చూసేవారు ఆశ్చర్యపోయేలా అని తెలుస్తోంది. మొహం మీద ఏ గాయాలు కాలేదు. ఏ మచ్చలూ లేవు.  ఆరోగ్యంగా, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చుంటున్నారు. టోటల్ హెల్త్ ఓ వారంలో సెట్ అయిపోతుందని తెలుస్తోంది.  

రెగ్యులర్ గా ఎవరో ఒకర్ని కలవడం, వాళ్లతో మాట్లాడుతూ వుండడం వల్ల మాట కూడా సెట్ అయిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సెలక్టివ్ గా రోజుకు లేదా రెండు రోజులకు ఒకర్ని మాత్రమే కలుస్తున్నారు. అది కూడా సాయంత్రం వేళల్లో. పగలంతా విశ్రాంతిగా వుంటున్నారు. ఇదీ సాయి దరమ్ తేజ్ హెల్త్ అప్ డేట్.