నిఖిల్ తో పాన్ సెన్సేషన్ సినిమా

దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా తరువాత అదే నిర్మాత భాగస్వామ్యంలో వచ్చిన కార్తికేయ 2 కూడా దేశవ్యాప్తంగా ఆడేసింది. ఇప్పుడు మళ్లీ మరో సెన్సేషన్ సినిమాకు ప్లాన్…

దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా తరువాత అదే నిర్మాత భాగస్వామ్యంలో వచ్చిన కార్తికేయ 2 కూడా దేశవ్యాప్తంగా ఆడేసింది. ఇప్పుడు మళ్లీ మరో సెన్సేషన్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

ఓ కాంట్రావర్షియల్, సెన్సేషనల్ సబ్జెక్ట్ తో హీరో నిఖిల్ తో సినిమాను నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ చేతిలో వున్న సినిమాలు పూర్తయిన తరువాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఓ పాన్ ఇండియా భారీ పీరియాడిక్ సినిమాను టాగోర్ మధు నిర్మాతగా నిఖిల్ ఓకే చేసాడు. దాని తరువాత అభిషేక్ అగర్వాల్ సినిమా వుంటుంది. దేశ వ్యాప్తంగా మాట్లాడుకునే సబ్జెక్ట్ తో ఈ సెన్నేషనల్ సినిమా వుంటుందని, తెలుస్తోంది

ఇటీవలే సక్సెస్ ఫుల్ గా 18 పేజెస్ అంటూ ఓ మాంచి లవ్ స్టోరీ ని అందించాడు నిఖిల్. దాని తరువాత స్పై సినిమాను రెడీ చేస్తున్నాడు. ఆపై మరో సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఆ రెండూ అయిన తరువాత ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు వుంటాయి.