మూడుపెళ్లిళ్ల న‌టి ఫిర్యాదు తెచ్చిన తంటా…

మూడో పెళ్లితో  న‌టి వ‌నిత విజ‌య్‌కుమార్ సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద మ‌హిళ‌గా గుర్తింపు పొందారు. త‌న మూడో పెళ్లిపై సోష‌ల్ మీడియాలో కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిందంటూ ఓ మ‌హిళ‌పై వ‌నిత‌ ఫిర్యాదు చేయ‌డం, ఆ…

మూడో పెళ్లితో  న‌టి వ‌నిత విజ‌య్‌కుమార్ సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద మ‌హిళ‌గా గుర్తింపు పొందారు. త‌న మూడో పెళ్లిపై సోష‌ల్ మీడియాలో కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిందంటూ ఓ మ‌హిళ‌పై వ‌నిత‌ ఫిర్యాదు చేయ‌డం, ఆ త‌ర్వాత ఆమె అరెస్ట్ తాజాగా కొత్త స‌మ‌స్య తీసుకొచ్చింది. స‌ద‌రు మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డం, బెయిల్‌పై విడుద‌లైన ఆమె ఆచూకీ తెలియ‌క పోవ‌డంతో వడపళని పోలీసులు ఆందోళ‌న చెందుతున్నారు.

త‌న‌పై ఓ మ‌హిళ సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్ట్ పెట్టిందంటూ న‌టి వనిత విజ‌య్‌కుమార్ వడపళని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు స‌ద‌రు మ‌హిళ‌ను గ‌త వారం అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆ మ‌హిళ బెయిల్‌పై విడుద‌లైంది. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు మ‌హిళ అరెస్ట్ సంద‌ర్భంగా వైద్యులు శాంపిల్స్ తీసుకున్నారు.

ఆ మ‌హిళ బెయిల్‌పై విడుద‌ల‌య్యాక కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష ఫ‌లితం వ‌చ్చింది. అందులో స‌ద‌రు మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో వడపళని పోలీసులు ఆ మ‌హిళ కోసం ఆరా తీశారు. ఆ మ‌హిళ చిరునామా మాత్రం చిక్క‌లేదు.  ఆమెను ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లిన వడపళని పోలీసులు కూడా వైద్య పరీక్ష చేసుకున్నారు. ఓ పోలీసుకు పాజిటివ్‌గా తేలింది.

దీంతో మిగిలిన సిబ్బంది, పోలీస్‌స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హించిన పోలీసులు ఆందోళ‌న చెందుతున్నారు. అస‌లు స‌ద‌రు మ‌హిళ ఎవ‌రికీ క‌నిపించ‌కుండా ఎక్క‌డికెళ్లిందో తెలియ‌క పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు

కాపీ పేస్టులు చేసేవాళ్ళు కూడా రివ్యూ రైటర్లు అయిపోయారు