ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

ఇప్పుడు వున్న హీరోల్లో గంభీరమైన గొంతు ఎవరికి వుంది అంటే ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు చెప్పాల్సిందే.  Advertisement ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఓ లెక్కలో వుంటుంది. అందుకే తమ సినిమాకు వాయిస్…

ఇప్పుడు వున్న హీరోల్లో గంభీరమైన గొంతు ఎవరికి వుంది అంటే ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు చెప్పాల్సిందే. 

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఓ లెక్కలో వుంటుంది. అందుకే తమ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ ను ఎంచుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో, భోగవిల్లి ప్రసాద్ తో కలిపి నిర్మించే సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వుంటుంది. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో వుంది

వచ్చే ఏడాది సమ్మర్ విడుదల టార్గెట్ గా రెడీ అవుతున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దండు కార్తీక్ వర్మ దర్శకుడు. ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ఇది. దీని మీద అటు నిర్మాతలకు, ఇటు హీరోకు కూడా మంచి హోప్స్ వున్నాయి. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తేజ్ చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.

భీమ్లానాయక్ తో అందరినీ ఆకట్టుకున్న సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తోంది. ఇప్పటికి దాదాపు 60శాతం పూర్తయిన తరువాత ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అన్న పాయింట్ ను యూనిట్ రివీల్ చేసింది.