పవన్ సినిమా ప్రకటన వస్తోందా?

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఉన్నట్లుండి రేపు ఓ అనౌన్స్ మెంట్ వస్తోంది అంటూ ట్వీట్ వేసేసారు. దాంతో ఫ్యాన్స్ హడావుడి మొదలైంది.  Advertisement ఎందుకంటే దానయ్య దగ్గర చాలా ప్రాజెక్టులు అనౌన్స్ మెంట్…

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఉన్నట్లుండి రేపు ఓ అనౌన్స్ మెంట్ వస్తోంది అంటూ ట్వీట్ వేసేసారు. దాంతో ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. 

ఎందుకంటే దానయ్య దగ్గర చాలా ప్రాజెక్టులు అనౌన్స్ మెంట్ కు వున్నా, వాటిల్లో కీలకమైనది సుజిత్-పవన్ కళ్యాణ్ సినిమానే. సాహో తరువాత సుజిత్ ఇప్పటి వరకు స్క్రిప్ట్ పని మీదే వున్నారు. ఇటీవలే ఓ మాంచి కథ చెప్పి పవన్ ను ఒప్పించారని వార్తలు కూడా వచ్చాయి.

అందువల్ల ఆ సినిమా అనౌన్స్ మెంట్ నే అయి వుంటుందని పవన్ ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. మైత్రీ మూవీస్ – హరీష్ శంకర్ సినిమాకు, అలాగే సుజిత్ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలు చేస్తారని బోగట్టా. 

గతంలో పవన్ తన సినిమాలను కొన్నాళ్లు ఆపుతారని అనుకున్నారంతా. ఎందుకంటే రథయాత్ర చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మరే యాత్ర మీద దృష్టి లేదని, కేవలం శని, ఆదివారాలు పార్టీ పనులు చూసుకుంటూ సినిమాలు చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ జరుగుతోంది. అది యాభై శాతం వర్క్ బకాయి వుంది. దానిని సమ్మర్ కు రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.