రష్మిక కూడా అదే తప్పు చేస్తోందా?

బంగారు బాతుగుడ్డు కథ మన తెలుగు హీరోయిన్లకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి. కానీ మన హీరోయిన్లకు మాత్రం ఎందుకో ఆ తలంపు ఉండదు. టాలీవుడ్ లో ఉన్న క్రేజ్…

బంగారు బాతుగుడ్డు కథ మన తెలుగు హీరోయిన్లకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి. కానీ మన హీరోయిన్లకు మాత్రం ఎందుకో ఆ తలంపు ఉండదు. టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ తో బాలీవుడ్, కోలీవుడ్ కు వెళ్లాలనుకుంటారు. సరిగ్గా అక్కడే పప్పులో కాలేస్తారు. అక్కడ క్లిక్ అవ్వక, ఇక్కడ ఉన్న క్రేజ్ పోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారు. ఇప్పుడు రష్మిక కూడా తన చేతిలో ఉన్న బంగారు బాతును అలానే చేయబోతోంది.

తెలుగులో ఈమె స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. కాల్షీట్ ఇస్తానంటే బేరాలు ఆడకుండా కళ్లకద్దుకొని తీసుకునే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. కానీ రష్మిక మాత్రం కోలీవుడ్ వైపు చూస్తోంది. కుదిరితే విజయ్, అజిత్ లాంటి హీరోల సరసన నటించాలనేది ఆమె ప్లాన్.

ప్రస్తుతం కార్తి సరసన నటిస్తోంది రష్మిక. ఆమెకిదే తొలి తమిళ సినిమా. ఈ సినిమా తర్వాత వీలైతే విజయ్ సరసన నటించాలనేది ఆమె ప్లాన్. ఈ దిశగా ఆమె ఇప్పటికే లాబీయింగ్ స్టార్ట్ చేసింది. ఏ నిమిషానైనా విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తుందనే ఆశతో తెలుగులో ఎవ్వరికీ కాల్షీట్లు ఇవ్వడం మానేసింది. రీసెంట్ గా రామ్ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తే, ఇదే మాట చెప్పి వెనక్కి పంపించేసింది.

ప్రస్తుతం ఆమె మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తోంది. అటు నితిన్ తో భీష్మ అనే సినిమా చేస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బన్నీ-సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది. ఇలా చేతినిండా సినిమాలున్నప్పటికీ, టాలీవుడ్ లోనే కొనసాగాలని ఆమె అనుకోవడం లేదు. తమిళ హీరోల వైపు ఆశగా చూస్తోంది. కార్తి తర్వాత కోలీవుడ్ నుంచి రష్మికకు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ