పవన్ కల్యాణ్ రాజకీయానికి మరో బ్రేక్!

తను వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి తను హాజరు కాలేకపోతున్నట్టుగా తెలుపుతూ పవన్ ఈ ప్రకటన చేశారు. ఒక ప్రెస్…

తను వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి తను హాజరు కాలేకపోతున్నట్టుగా తెలుపుతూ పవన్ ఈ ప్రకటన చేశారు. ఒక ప్రెస్ రిలీజ్ చేసి.. తను వెన్నునొప్పితో బాధపడుతున్న విషయాన్ని ఆయన తెలిపారు. చాలాకాలంగా తను ఈ రకంగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయన వివరించారు.

'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో తన వెన్నుకు గాయమైందని పవన్ వివరించారు. అప్పటి నుంచి వైద్యం పొందుతున్నట్టుగా తెలిపారు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని, అయితే తను సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇటీవలి ఎన్నికల సమయంలో తను తీవ్రంగా తిరగడంతో.. వెన్నునొప్పి తిరబెట్టిందని.. దీంతో రౌండ్ టేబుల్ సమావేశానికి రాలేకపోతున్నట్టుగా పవన్ తెలిపారు.

తనను సమావేశానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అని చెప్పిన పవన్, తను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్టుగా మాత్రం స్పష్టంచేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయానికి వెన్నునొప్పి మరో బ్రేక్ వేసినట్టుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు