టీడీపీ శిబిరాలు ఖాళీ.. పోలీసుల భద్రతతో సొంతూళ్లకు!

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రాజకీయ పునరావాస శిబిరాలను పోలీసులు ఖాళీ చేయించారు. ఆ శిబిరాల్లోని జనాలను వాళ్ల వాళ్ల సొంతూళ్లకు పంపించారు. పోలీసుల భద్రత మధ్యన వారిని సొంతూళ్లకు చేరుస్తున్నారు. ఒకవేళ వాళ్ల వాళ్ల…

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రాజకీయ పునరావాస శిబిరాలను పోలీసులు ఖాళీ చేయించారు. ఆ శిబిరాల్లోని జనాలను వాళ్ల వాళ్ల సొంతూళ్లకు పంపించారు. పోలీసుల భద్రత మధ్యన వారిని సొంతూళ్లకు చేరుస్తున్నారు. ఒకవేళ వాళ్ల వాళ్ల ఊర్లలో రాజకీయ దాడులు జరుగుతుంటే.. ఇంతకు మించిన గొప్ప పరిష్కారం లేదు.  పోలీసులే స్వయంగా వాళ్లను సొంతూళ్లకు పంపించారు. వారికి చంద్రబాబు నాయుడి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అవసరం లేదు కూడా.

చంద్రబాబు నాయుడు ఎన్నిరోజులని పునరావాస శిబిరాలు నిర్వహించగలరు? వారికి తిండి పెట్టి ఎన్నాళ్లని పోషిస్తారు పాపం. ఇక చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూర్ అంటూ వారిని ఊళ్లకు చేర్చినా.. ఈయన వెళ్లి అక్కడ ఎన్నిరోజులు ఉంటారు? ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. పోలీసులు టీడీపీ శిబిరాల్లోని జనాలను దగ్గరుండి తీసుకెళ్లారు.

వాళ్ల ఊర్లకు చేర్చారు. కొన్నిరోజుల పాటు ఆయా ఊళ్లలో పోలీసుల మకాంపెడితే.. మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. అయితే అసలు అక్కడ సమస్యే లేదనే టాక్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడును ఆయా వాళ్లలోని ప్రజలు తిడుతున్న వీడియోలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి పల్లెల్లో హింసను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది వాపోతూ ఉన్నారు.

ఇక పునరాస శిబిరాల్లో ఉన్న వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులే అని.. వారికి ఒక్కోరికి పదివేల రూపాయలు, చికెన్ బిరియానీలు పెట్టి.. పోషిస్తున్నారనే వార్తలు కూడా వస్తుండటం గమనార్హం.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!