రిపబ్లిక్ వస్తోంది

సాయి ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో భగవాన్ పుల్లారావు నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ఈ సినిమా ఏనాడో కాపీ రెడీ అయి వుంది. Advertisement అక్టోబర్ 1న విడుదల ప్లాన్ చేసి వున్నారు.…

సాయి ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో భగవాన్ పుల్లారావు నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ఈ సినిమా ఏనాడో కాపీ రెడీ అయి వుంది.

అక్టోబర్ 1న విడుదల ప్లాన్ చేసి వున్నారు. అయితే హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరగడంతో సినిమా విడుదల మీద అనుమానాలు ముసురుకున్నాయి. 

అయితే లేటెస్ట్ ఇన్ ఫో ఏమిటంటే యాజ్ ఇట్ ఈజ్ షెడ్యూలు ప్రకారమే ఈ సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. జీటీవీ సంస్థ ఈ సినిమాకు మొదట్లోనే తీసేసుకుంది. ఆ సంస్థనే సినిమాను మార్కెట్ చేస్తోంది. 

ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారమే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు గతంలోనే గట్టి ప్రచారం నిర్వహించారు. 

ఇప్పుడు డైరక్టర్, హీరోయిన్ అంతా పబ్లిసిటీలో పాలు పంచుకుంటారు. అందువల్ల విడుదలకు ఆటకం ఏదీ లేదని నిర్మాణ వర్గాల బోగట్టా.