ఇండస్ట్రీకి కొత్త ఐటెం భామ వచ్చింది

మొన్నటివరకు అప్సర రాణి ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఊర్వశి రౌధేలా వంతు వచ్చినట్టుంది. ఈమెను ఐటెం భామగా తీసుకునేందుకు టాలీవుడ్ జనాలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఊర్వశి కూడా ఇలాంటి ఆఫర్లకు ఓకే చెబుతోంది.…

మొన్నటివరకు అప్సర రాణి ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఊర్వశి రౌధేలా వంతు వచ్చినట్టుంది. ఈమెను ఐటెం భామగా తీసుకునేందుకు టాలీవుడ్ జనాలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఊర్వశి కూడా ఇలాంటి ఆఫర్లకు ఓకే చెబుతోంది.

రామ్-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ సినిమాలో ఓ ఐటెంసాంగ్ కోసం ఊర్వశిని తీసుకున్నారు. పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇక చిరంజీవి-రవితేజ హీరోలుగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం కూడా ఊర్వశినే తీసుకున్నారు. ఈ పాట షూటింగ్ కూడా పూర్తయింది.

ఇలా ఒకేసారి రెండు పెద్ద సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది ఊర్వశి. దీంతో ఈమెను తీసుకునేందుకు మరికొంతమంది టాప్ ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది కేవలం ఊర్వశి కోసం, ఐటెంపాటను ఇరికించే ఆలోచన కూడా చేస్తున్నారు.

నిజానికి ఊర్వశి ఈ సెగ్మెంట్ లోకి ఎప్పుడో రావాల్సిన పిల్ల. అయితే ఐటెంసాంగ్స్ కంటే హీరోయిన్ రోల్స్ పై కన్నేసింది ఈ సోషల్ మీడియా స్టార్. ఇందులో భాగంగా తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా కూడా చేసింది. సంపత్ నంది కనుసన్నల్లో తెరకెక్కిన ఆ సినిమా మొత్తం ఊర్వశి మాత్రమే కనిపిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ అన్నమాట. అయితే హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇక చేసేదేం లేక ఇలా ఐటెంసాంగ్స్ కు పచ్చజెండా ఊపింది.