విక్రమ్-చైతన్య-హర్రర్ సిరీస్

విజువల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమా అన్నది థియేటర్ దాటి, టీవీల మీదుగా ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. ప్రపంచ సినిమా అన్నది అందరికీ పరిచయం అయిపోతోంది.  Advertisement ఇలాంటి నేపథ్యంలో ఓటిటి ని గతంలో…

విజువల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమా అన్నది థియేటర్ దాటి, టీవీల మీదుగా ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. ప్రపంచ సినిమా అన్నది అందరికీ పరిచయం అయిపోతోంది. 

ఇలాంటి నేపథ్యంలో ఓటిటి ని గతంలో టీవీని చూసినట్లు చిన్న చూపు చూడడం లేదు. అక్కడ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నారు సినిమా జనాలు. అందుకే ఓటిటి వెబ్ సిరీస్ ల్లో సినిమా జనాలు కనిపించడం పెరుగుతోంది.

మొన్నటకి మొన్న అమెజాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మన్ లో హీరోయిన్ సమంత నటించి, మెప్పించింది. ఓ పెద్ద హీరోయిన్ వెబ్ సిరీస్ కు వెళ్లడం అదే టాలీవుడ్ లో మొదలు. ఇప్పుడు నాగ్ చైతన్య వంతు వచ్చింది. 

విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో నాగ్ చైతన్య ఓ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోతున్నాడు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమషాలు వుంటుంది. టోటల్ ఎనిమిది ఎపిసోడ్ లు.

గమ్మత్తేమిటంటే, హర్రర్ సినిమాలు అంటే ఆమడదూరం వుండేంత భయం నాగ్ చైతన్యకు. అలాంటిది అదే జోనర్ లో వెబ్ సిరీస్ చేయబోవడం. విక్రమ్ కే కుమార్ తన కెరీర్ స్టార్టింగ్ లో 13 బి అనే మాంచి హర్రర్ సినిమా అదించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ జోనర్ ను టచ్ చేయడం ఇదే. 

ప్రస్తుతం చైతూ-విక్రమ్ ల కాంబినేషన్ లో థాంక్యూ సినిమా నిర్మాణంలో వుంది. అది పూర్తి కాగానే ఇది మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను నిర్మాత శరత్ మరార్.