తిరుపతి టికెట్ల విషయంలో బుక్ అయిన టీడీపీ!

ఏదో ఆయుధం దొరికింది జగన్ మీద మతయద్ధం చేసేయవచ్చు అని అనుకున్న వారికి ఝలక్ తగిలింది. తిరుపతి బస్ టికెట్ల వెనుక యాడ్స్ తో పరమత ప్రచారం జరిగిందని కొంతమంది వీర హిందుత్వ వాదులు…

ఏదో ఆయుధం దొరికింది జగన్ మీద మతయద్ధం చేసేయవచ్చు అని అనుకున్న వారికి ఝలక్ తగిలింది. తిరుపతి బస్ టికెట్ల వెనుక యాడ్స్ తో పరమత ప్రచారం జరిగిందని కొంతమంది వీర హిందుత్వ వాదులు రోడ్డు ఎక్కారు. ఈ మధ్యనే పచ్చకండువాల నుంచి కాషాయ కండువాలకు మారిన కొందరు ఈ విషయంలో తెగ స్పందించేశారు.

ఈ నేపథ్యంలో అసలు కథ చాలా త్వరగానే బయటకు వచ్చింది. టికెట్ల వెనుక చంద్రబాబు నాయుడు పేరు కూడా బయటపడటంతో వీర హిందుత్వ వాదులు కిమ్మనలేని పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం నుంచి ఆ యాడ్స్ వెళ్లింది నిజమే. అన్ని టికెట్ పేపర్ బండిల్స్ వెనుకా ఆ యాడ్స్ ను వేశారు. వాటినే రాష్ట్రమంతా పంపించారు. తిరుపతి బస్సులకు కూడా అవే వెళ్లాయి.

అయితే ఆ ముద్రణంతా జరిగింది మాత్రం చంద్రబాబు నాయుడి జమానాలోనే. అప్పట్లో మైనారిటీలను ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలకు సంబంధించిన యాడ్స్ అవి. హజ్ యాత్రలు, జెరుసలేం యాత్రలకూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలకు సంబంధించిన యాడ్స్ అవి. వాటి సమర్పకుడిగా చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది.

సగంసగం ఫొటోలను సోషల్ మీడియాకు ఎక్కించి జగన్ మీద బురదజల్లే ప్రయత్నం చేయగా, అసలు ఫొటోలు బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. అసలు దోషి చంద్రబాబు నాయుడు అనే విషయం తేలడంతో వీరహిందుత్వ వాదులు కూడా కిక్కురుమనడం లేదిప్పుడు! ఎంతైనా చంద్రబాబు భక్తులు కదా!

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి