క్యాంప్ మార్చేసిన సుజిత్

సాహో సినిమా తరువాత చాలా కాలం వరకు దర్శకుడు సుజిత్ పేరు వినిపించలేదు. మళ్లీ మరో సినిమా యువి సంస్థలోనే వుంటుందని, అందుకే అక్కడే వుండి పని చేసుకుంటున్నారని టాలీవుడ్ లో చెప్పుకునేవారు.  Advertisement…

సాహో సినిమా తరువాత చాలా కాలం వరకు దర్శకుడు సుజిత్ పేరు వినిపించలేదు. మళ్లీ మరో సినిమా యువి సంస్థలోనే వుంటుందని, అందుకే అక్కడే వుండి పని చేసుకుంటున్నారని టాలీవుడ్ లో చెప్పుకునేవారు. 

గత ఏడెనిమిది నెలల క్రితం సుజిత్ ఇప్పుడు క్యాంప్ మార్చారని, డివివి దానయ్య దగ్గర వున్నారని, దర్శకుడు త్రివిక్రమ్ కరుణా కటాక్షాల కోసం నిత్యం ఆయన దగ్గరకు వెళ్లి వస్తున్నారని వినిపించడం ప్రారంభమైంది. తెరి రీమేక్ ప్రాజెక్టు ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నారని అదనపు వార్తలు వినిపించాయి. ఆ విధంగా యువి సంస్థ నుంచి దానయ్య దగ్గరకు వచ్చారు సుజిత్.

కానీ లేటెస్ట్ గా మళ్లీ క్యాంప్ మారిందని వినిపిస్తోంది. ప్రస్తుతం సుజిత్ మైత్రీ మూవీస్ సంస్థలో వుంటున్నారట. అక్కడే వర్క్ చేసుకుంటున్నారట. తెరి రీమేక్ హక్కులు మైత్రీ దగ్గరే వున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను మైత్రీకి చేయాల్సి వుంది. మరి ఆ విధంగా సుజిత్ అక్కడ వున్నారేమో అన్న టాక్ ఒకటి వుంది.

కానీ అది కాదు విషయం. సుజిత్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సినిమా చేయబోతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కు లైన్ చెప్పారని, ఆ లైన్ ను డెవలప్ చేసే పనిలోనే వున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ తో సినిమా ఎంతకూ సెట్ కాక సుజిత్ ప్రస్టేట్ అయ్యారని అందుకే క్యాంప్ మార్చేసారని గ్యాసిప్. మరి కొంత కాలం ఆగితే అసలు పక్కాగా ఏ సినిమా చేస్తున్నారో తెలుస్తుందేమో?