కీర్తి సురేష్ బేరం తెగాల్సి వుందా?

మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోందని వార్తలు బయటకు పొక్కాయి.  ఈలోగా కీర్తి ఇచ్చిన ఇన్ స్టా చిట్ చాట్ లో కూడా తాను చేస్తున్నా అని చెప్పినట్లు కూడా…

మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోందని వార్తలు బయటకు పొక్కాయి.  ఈలోగా కీర్తి ఇచ్చిన ఇన్ స్టా చిట్ చాట్ లో కూడా తాను చేస్తున్నా అని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అంత క్లారిటీగా చెప్పలేదు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ లు కూడా కనిపించాయి. 

కీర్తి పేరు బయటకు రావడం, ఇలా పొక్కడం వెనుక నిర్మాతల వ్యూహం వుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  కీర్తి సురేష్ ను సంప్రదించడం, ఆమెకు కథ చెప్పించడం వరకు జరిగింది. ఆమెకు కథ నచ్చింది. అయితే ఆ తరువాత పార్ట్, అంటే రెమ్యూనిరేషన్ పార్ట్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. అయితే రేటుతో సంబంధం లేకుండానే కమిట్ చేయించే ప్లాన్ జరుగుతోందా అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.

మహానటి తరువాత కీర్తి సురేష్ రెమ్యూనిరేషన్ కాస్త ఎక్కువే వుంది. ప్రస్తుతం ఆమె కోటి ఇరవై లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటోంది. అది ఆరేడు నెలల కిందట ముచ్చట. మరి ఇప్పుడు ఎంత అడుగుతుందో? మహేష్ బాబు లాంటి హీరో సినిమా అంటే ఎంత అడుగుతుందో తెలియదు. ఈ బేరసారాలు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదని, తెలుస్తోంది.  కథ నచ్చింది, మహేష్ బాబు సినిమా కాబట్టి కీర్తి ఆరునెలల క్రితం రెమ్యూనిరేషన్ కే ఓకె అంటుందో, పెంచుతుందో చూడాలి మరి.

నమ్రత అసంతృప్తి

ఇదిలా వుంటే కీర్తి సురేష్ పేరు  బయటకు రావడం పట్ల మహేష్ వ్యవహారాలు పర్యవేక్షించే నమ్రత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన విషయాలు కాస్త కాస్తగా రివీల్ చేస్తూ, సినిమాకు బజ్ తీసుకురావాలనుకుంటే ఇలా వెల్లడి కావడం పై ఆమె తన యూనిట్ దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే చిత్రంగా కీర్తి సురేష్ పేరు బయటకు వచ్చేవరకు, నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట కూడా తెలియకపోవడం. ఆయనను కూడా పూర్తిగా సినిమా విషయాల విషయంలో కాస్త డార్క్ లోనే వుంచారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చైనాకి బుద్ధి చెబుదాం

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం