ఓ ఇంటివాడు కాబోతున్న సాహో డైరక్టర్

సాహో దర్శకుడు సుజీత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన ప్రవళికతో సుజీత్ నిశ్చితార్థం పూర్తయింది. లాక్ డౌన్ కావడంతో కేవలం కొంతమంది బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా ఎంగేజ్…

సాహో దర్శకుడు సుజీత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన ప్రవళికతో సుజీత్ నిశ్చితార్థం పూర్తయింది. లాక్ డౌన్ కావడంతో కేవలం కొంతమంది బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా ఎంగేజ్ మెంట్ కానిచ్చేశాడు సుజీత్. ప్రవళిక ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డెంటిస్ట్.

సాహో సినిమాతో భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న సుజీత్, చాన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమైపోయాడు. అలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ డైరక్టర్, ఏకంగా చిరంజీవిని డైరక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు.

మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నాడు సుజీత్. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే, చిరంజీవి ఆచార్య సినిమా పూర్తిచేయాలి. అది థియేటర్లలోకి రావాలి. అప్పటివరకు లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు.

ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇంట్లో చూసిన సంబంధాన్నే ఓకే చేశాడు. అలా ప్రవళికను తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు.

రన్ రాజా రన్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు సుజీత్. తన రెండో ప్రయత్నంగా చేసిన సాహోతో ఫ్లాప్ చవిచూశాడు. లూసిఫర్ రీమేక్ తర్వాత అతడు రామ్ చరణ్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కొన్ని రోజుల కిందట లీకులు వదిలారు. 

నిమ్మగడ్డ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం