ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోక‌పోతే తాట తీస్తాంః రోజా

చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌ల‌పై పంచ్‌లు విస‌ర‌డంలో మంత్రి రోజాకు ప్ర‌త్యేక గుర్తింపు వుంది. ఇవాళ మ‌రోసారి టీడీపీపై ఓ రేంజ్‌లో ఆమె విరుచుకుప‌డ్డారు. తిరుప‌తిలో రోజా మీడియాతో మాట్లాడుతూ ఐటీడీపీపై సెటైర్స్ విసిరారు. ఐటీడీపీ అంటే…

చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌ల‌పై పంచ్‌లు విస‌ర‌డంలో మంత్రి రోజాకు ప్ర‌త్యేక గుర్తింపు వుంది. ఇవాళ మ‌రోసారి టీడీపీపై ఓ రేంజ్‌లో ఆమె విరుచుకుప‌డ్డారు. తిరుప‌తిలో రోజా మీడియాతో మాట్లాడుతూ ఐటీడీపీపై సెటైర్స్ విసిరారు. ఐటీడీపీ అంటే ఇడియ‌ట్స్ టీడీపీగా ఆమె అభివ‌ర్ణించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై నేరాలు ఎక్కువ జ‌రిగాయ‌ని విమ‌ర్శించారు.

రాజ‌కీయాల‌కు సంబంధం లేని త‌మ వ‌దిన‌మ్మ భార‌త‌మ్మ‌పై కూడా ఐటీడీపీ వాళ్లు ఎన్ని పోస్టులు పెట్టారో చూశామ‌న్నారు. టీడీపీ చేసిన మంచి లేదా అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో చెప్పుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. ఎందుకంటే 14 ఏళ్లు అధికారంలో వున్న‌ప్ప‌టికీ టీడీపీ చేసిందేమీ లేద‌న్నారు. ఇక అధికారంలోకి రాలేమ‌ని వాళ్ల‌కు అర్థ‌మైంద‌న్నారు.

ఎవ‌రైతే ప్ర‌జ‌ల గుండెల్లో  చిర‌స్థాయిగా నిలిచిన వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు లేదా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న ఇడియ‌ట్స్ వాళ్ల‌ని ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డారు. దానికి హెడ్ లోకేశ్ అని ధ్వ‌జ‌మెత్తారు. ఇక‌నైనా వాళ్లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోక‌పోతే మాత్రం తాట తీస్తామ‌ని రోజా ఘాటు హెచ్చ‌రిక చేశారు. జ‌గ‌న్‌కు ఇంకా శిక్ష ఎందుకు వేయ‌లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌డాన్ని చూశాన‌న్నారు.

చంద్ర‌బాబుకు అరికాళ్ల నుంచి కూడా బ్రెయిన్ బ‌య‌టికొచ్చిందేమో అని ఆమె సందేహం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌ల‌పై ఏ స్థాయిలో నేర‌శాతం వుందో వాళ్ల డీజీపీనే స్వ‌యంగా చెప్పార‌ని గుర్తు చేశారు. జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళ‌ల‌ను త‌న అక్క‌చెల్లెళ్లుగా భావించి ఎన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారో చూశామ‌ని ఆమె చెప్పుకొచ్చారు.