ప్రభాస్ కళ్లు చూసి ఓకే చేశాడట

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఆదిపురుష్. రామాయణ ఇతిహాసాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది హీరోలున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది…

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఆదిపురుష్. రామాయణ ఇతిహాసాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది హీరోలున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది స్టార్స్ ఉన్నారు. మరి రాముడి పాత్ర కోసం ప్రభాస్ నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు. ఈ ప్రశ్నకు దర్శకుడు ఓం రౌత్ చెప్పే సమాధానం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆదిపురుష్ లో రాముడి పాత్ర కోసం కళ్లు చూసి ప్రభాస్ ను సెలక్ట్ చేశాడట ఓం రౌత్. ప్రభాస్ కళ్లు చూసిన తర్వాత తనకు రఘురామ్ పాత్ర కోసం మరో హీరోను తీసుకోవాలని అనిపించలేదంటున్నాడు.

“నాకు తెలిసినంతవరకు కళ్లు చూసి మనసు ఎలాంటిదో చెప్పేయొచ్చు. ప్రభాస్ ది చాలా మంచి మనసు. అందుకే అతడి కళ్లు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటాయి. అతడి కళ్లు చూసిన తర్వాత నా మనసులో ఉన్న రఘురాముడ్ని మరింత బాగా ఊహించుకోగలిగాను. ప్రభాస్ పై కట్ చెప్పిన ప్రతిసారి ఆ సీన్ లో అతడి కళ్లలో ఆ ప్రశాంతత చూశాను. అది ఎంతో స్వచ్ఛమైనది.”

ఇలా ఆదిపురుష్ కోసం ప్రభాస్ ను ఎంపిక చేయడం వెనక రీజన్ ను బయటపెట్టాడు ఓం రౌత్. ప్రభాస్ కళ్లలో ఎంత నిశ్శబ్దం కనిపిస్తుందో, ఆ కళ్లతో అదే స్థాయిలో రౌద్రం కూడా పలికించగలడని.. ఆదిపురుష్ కోసం ఆ క్వాలిటీ చాలా అవసరం అంటున్నాడు రౌత్.

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా ఇదే. దేశంలోని ప్రముఖ భాషలతో పాటు ఇంగ్లిష్ లో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.