మహేష్ 27కు నిర్మాతగా సోనీ?

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి. అది ఫిక్స్. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి ప్రారంభణ అవుతుంది. అది కూడా ఫిక్స్. అయితే…

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి. అది ఫిక్స్. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి ప్రారంభణ అవుతుంది. అది కూడా ఫిక్స్. అయితే నిర్మాత ఎవరు? దిల్ రాజు సోలోనా? లేక దిల్ రాజు-పివిపి భాగస్వామ్యమా? లేక మరే నిర్మాత అయినా నిర్మిస్తారా?

ఇటీవల మాట్లాడినపుడు ఈ విషయం ఇంకా ఫిక్స్ కాలేదని దిల్ రాజే చెప్పారు. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాను తాను సోలోగా నిర్మించాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వుండడం వల్ల లాభం వుండడం లేదన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మహర్షి సినిమా ఆయన సోలోగా చేయాల్సిందే, కానీ అలా జరగలేదు.

కానీ ఈ సినిమా సోలోగా చేయాలంటే పివిపి అడ్డంకి వుంది. వంశీ పైడిపల్లికి పివిపితో కమిట్ మెంట్ వుంది. మరి ఆ కమిట్ మెంట్ ను ఏ విధంగా సెటిల్ చేసుకుంటారు, సెటిల్ అవుతుందా? అన్న దాన్నిబట్టి దిల్ రాజు సొలోగా సినిమా చేయడం అన్నది ఆధారపడి వుంటుంది.

మరోపక్క దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్టులోకి సోనీ లాంటి బడాసంస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. మరి సోనీ ఎంటర్ అయితే, దిల్ రాజు, పివిపిల సంగతేమిటి? అన్నది చూడాలి. మొత్తంమీద మహేష్ 27వ సినిమా ఎవరు నిర్మిస్తారు అన్నది కాస్త ఆసక్తికరంగానే వుంది.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!