ఆ కేసుల‌కు ప్ర‌జాధ‌న‌మా?- హైకోర్టు ఆశ్చ‌ర్యం

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల ఖ‌ర్చుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయ‌డంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఇది ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు గ‌ట్టిగా ప్ర‌శ్నించింది.  Advertisement కోర్టు ధిక్క‌ర‌ణ…

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల ఖ‌ర్చుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయ‌డంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఇది ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు గ‌ట్టిగా ప్ర‌శ్నించింది. 

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల ఖ‌ర్చుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.58 కోట్ల నిధులు మంజూరు చేయ‌డంపై హైకోర్టులో ఓ లెక్చ‌ర‌ర్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ హిమా కోహ్లి, న్యాయ‌మూర్తి విజ‌య్‌సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీ ఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. 

సీఎస్ సోమేష్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసులిచ్చింది. నిధులు విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా హైకోర్టు వేసింది.

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల ఖ‌ర్చుల‌కు ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేయ‌డంపై హైకోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డాన్ని పౌర‌స‌మాజం హ‌ర్షించడంతో పాటు ఆహ్వానిస్తోంది. అస‌లు కోర్టును ధిక్క‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది, ఇపుడు ప్ర‌జాసొమ్మును అప్ప‌నంగా చెల్లించాల‌ని ప్ర‌భుత్వం భావించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.