అవకాశం వస్తే గాంధీ ఫోటో మారుస్తారు!

బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి కంటే ముందు వ‌రుస ఉంటారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఎప్ప‌టికప్పుడు త‌న దైన శైలిలో ట్వీట‌ర్ లోను,…

బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి కంటే ముందు వ‌రుస ఉంటారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఎప్ప‌టికప్పుడు త‌న దైన శైలిలో ట్వీట‌ర్ లోను, మీడియా వేదిక‌లుగా బీజేపీని, ఆ పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శిస్తునే ఉంటారు. 

తాజాగా కేంద్ర‌ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ పై త‌న‌దైన శైలీలో పంచ్ వేశారు. ఇప్ప‌టికే గుజ‌రాత్ లో స‌ర్ధార్ ప‌టేల్ స్టేడియంను న‌రేంద్ర మెడీ మ‌ర్చిన బీజేపీ, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ కు అవ‌కాశం వ‌స్తే క‌రెన్సీ నోట్ల‌పై గాంధీ ఫోటోకు బ‌దులు మోడీ ఫోటో పెడ‌తారేమో అని ఎద్దేవా చేశారు.

అహ్మ‌దాబాద్ లోని ఎల్జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర‌ మోడీ కాలేజీగా మ‌ర్చ‌డాని ఉద్దేశిస్తూ కేంద్రం తీరుపై కేటీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మణినగర్ ప్రాంతంలో ఏయంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఎల్జీ మెడికల్ కాలేజీ'ని 'నరేంద్ర మోడీ మెడికల్ కాలేజ్' గా మ‌రుస్తున్న‌ట్లు అహ్మ‌దాబాద్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మ‌ధ్యకాలంలో బీజేపీ పాత పేర్ల‌ను తీసివేసి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరు పెట్టుకొవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా బీజేపీ నేత‌లు తమ పంధా మ‌ర్చుకొవ‌డం లేదు.