కోస్తా పిల్లి… ఆ మాజీ మంత్రి

ఎవరైనా తమను తాము పులిని అని అనుకుంటారు. . ఆయన అలాగే చెప్పుకుంటారు. అభిమానులు అనుచరులు కూడా అదే అంటారు. కానీ ప్రత్యర్ధులు ఊరుకోరు కదా. ఆయన్ని అలా లైట్ తీస్కొని  పిల్లి అంటారు.…

ఎవరైనా తమను తాము పులిని అని అనుకుంటారు. . ఆయన అలాగే చెప్పుకుంటారు. అభిమానులు అనుచరులు కూడా అదే అంటారు. కానీ ప్రత్యర్ధులు ఊరుకోరు కదా. ఆయన్ని అలా లైట్ తీస్కొని  పిల్లి అంటారు. కోస్తా టైగర్ మా అయ్యన్నపాత్రుడు అని ఫ్యాన్స్ గొంతు చించుకుంటే కోస్తా పిల్లి అయ్యన్న అని అలా తీసి పారేశారు నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.

అయ్యన్నపాత్రుడు అయిదేళ్ళుగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, కేవలం శంకుస్థాపనలు చేస్తూ శిలాఫలకాల మంత్రిగా మిగిలిపోయారని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. నర్శీపట్నం జనాలకు 166 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగు నీరు అందించే కార్యక్రమాన్ని తాను ఎమ్మెల్యేగా చేపడితే అయ్యన్న పాత్రడు తెగ  బిల్డప్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీ పవర్ లోకి వస్తే మా సంగతి చూస్తామాని, అందరి లెక్కలూ తేలుస్తామని అయ్యన్న హూంకరిస్తున్నారని, అయితే ఆయన అలా ఒక డైరీ కాదు, ముప్పయి డైరీలు కొనుక్కుని మరీ రాసుకోవాల్సిందే తప్ప మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు చేసేది ఏదీ లేనే లేదని గాలి తీసేశారు. 

ఈ రొజుకీ అయ్యన్న భ్రమలలో బతుకుతున్నారని, ఆయన రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని, మరో ముప్పయ్యేళ్ళు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఉమాశంకర్ చెప్పారు. ఈ లెక్కన  2052 వరకూ అయ్యన్న డైరీలు కొనుక్కోవాల్సిందేనట. ఇదీ వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట.