మళ్లీ కరోనా బారినపడ్డ కేటీఆర్

క‌రోనా త‌గ్గిన‌ట్లే తగ్గి మ‌ళ్లీ దాని పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ మ‌రోసారి క‌రోనా బారిన‌ప‌డ్డారు. Advertisement స్వ‌యంగా మంత్రి కేటీఆర్ త‌న ట్విట‌ర్ లో…

క‌రోనా త‌గ్గిన‌ట్లే తగ్గి మ‌ళ్లీ దాని పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ మ‌రోసారి క‌రోనా బారిన‌ప‌డ్డారు.

స్వ‌యంగా మంత్రి కేటీఆర్ త‌న ట్విట‌ర్ లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని పోస్ట్ చేశారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింద‌ని తెలిపారు. గ‌త కొద్ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారంద‌రూ టెస్టులు చేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌త నెల‌లో కేటీఆర్ కాలు నొప్పితో ఇంటి నుండి కార్య‌క‌ల‌పాలు చేశారు. ఇప్పుడు కూడా క‌రోనా జాగ్ర‌త‌ల‌తో ఇంటిలో ఉంటూ ప‌రిపాల‌న వ్య‌వ‌హ‌రాలు చేయ‌బోతున్నారు.

దేశంలొ క‌రోనా త‌గ్గిన‌ట్లు త‌గ్గి త‌న ప్ర‌భావం చూపుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇంకా దేశంలోను, ప్ర‌పంచంలోను జ‌నాల‌ను భ‌య‌పెడుతునే ఉంది.