దేశం విడిచి పోతాడట

గొనె ప్రకాష్ రావు ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి చాలామందికి తెలుసు. కాంగ్రెస్ హయాంలో చాలా పాపులర్. ఈ మధ్య టీవీల్లో కనిపిస్తున్నాడు. ఆయన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటది ? …

గొనె ప్రకాష్ రావు ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి చాలామందికి తెలుసు. కాంగ్రెస్ హయాంలో చాలా పాపులర్. ఈ మధ్య టీవీల్లో కనిపిస్తున్నాడు. ఆయన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటది ? 

అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారుల ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని గొనె ప్రకాష్ రావు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. 

ఈ మేరకు ఆయన సీఎం కేసిఆర్ కు లేఖ రాస్తూ తాను దర్యాప్తు సంస్థ ముందు హజరై ఈ అక్రమాలు అన్నింటినీ నిరూపిస్తానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే తాను దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని కూడా సవాల్ చేశారు గొనె ప్రకాష్ రావు. 

రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణాలపై గతం నుండి అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భావానికి ముందు కేసిఆర్ సైతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. తెలంగాణా వచ్చాక గమ్మున ఉండిపోయాడు.