చంద్రబాబుకు భారీ భద్రత!

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  Advertisement ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను డబుల్ చేసింది. 6+6…

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను డబుల్ చేసింది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ఈ భ‌ద్ర‌త పెంపు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తున్న‌ట్లు ఉత్తర్వులలో పేర్కొంది.

గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. 

గ‌తంలో టీడీపీ పార్టీ అఫీసు పార్టీపై దాడి, కుప్పం ఘ‌ట‌న‌ల దృష్టా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.