‘తిమ్మరసు’ వస్తున్నాడు

కరోనా రెండో దశ దాదాపు ముగిసినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి.  Advertisement దాంతో ధియేటర్ల దుమ్ము దులిపి, సినిమాల విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తొలిసారిగా…

కరోనా రెండో దశ దాదాపు ముగిసినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి. 

దాంతో ధియేటర్ల దుమ్ము దులిపి, సినిమాల విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తొలిసారిగా ఓ సినిమావిడుదల ప్రకటన వచ్చేసింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తిమ్మరసు సినిమాను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. సత్యదేవ్ హీరోగా తయారైన ఈ సినిమాకు ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఆధారం. 

ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత.

కొవిడ్ రెండో దశ అనంతరం యు ఎస్ లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే.