ఈ విశాఖకు ఏమైంది…?

ఈ విశాఖకు ఏమైంది. ప్రశాంత విశాఖకు అసలు ఏమి పట్టుకుంది. ఇది నగరవాసులలో మెదులుతున్న ప్రశ్న. విశాఖలో అతి పెద్ద కాలనీగా ఎంవీపీ ఉంది. ఆసియా ఖండంలోనే ఇది పెద్దదిగా చెబుతారు. ఈ కాలనీలో…

ఈ విశాఖకు ఏమైంది. ప్రశాంత విశాఖకు అసలు ఏమి పట్టుకుంది. ఇది నగరవాసులలో మెదులుతున్న ప్రశ్న. విశాఖలో అతి పెద్ద కాలనీగా ఎంవీపీ ఉంది. ఆసియా ఖండంలోనే ఇది పెద్దదిగా చెబుతారు. ఈ కాలనీలో ఎపుడు కూల్ గానే వాతావరణం ఉంటుంది. అలాంటి చోట ఒక కీలక జంక్షన్ లో అందరూ చూస్తూండంగా ఒక వ్యక్తిని కత్తి పోట్లు పొడిచి హత్య చేశారు.

అది కూడా సాయంత్రం సమయం కూడా ఇంకా కాని వేళ. ఇలా నడిరోడ్డుపైన మర్డర్ చేయడమేంటి అన్నది చూసిన వారు మాత్రం హడలిపోతున్నారు. విశాఖ అప్పూఘర్ కి చెందిన అనిల్ కుమార్ అనే రౌడీ షీటర్ అలా దారుణ హత్యకు గురి అయ్యాడు. అతన్ని హత్య చేసింది కూడా తోటి వారే. అంతా కలసి బార్ లో మందు కొట్టి ఆ మీదట గొడవ పడి బయటకు వచ్చిన తరువాత జరిగిన ఘాతుకం ఇది.

ఇక దీనికి రెండు రోజుల ముందే పెందుర్తిలో ఒక సైకో కూడా వీరంగం సృష్టించాడు. వరసబెట్టి మూడు హత్యలు చేసిన ఆ సైకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పూర్తిగా స్త్రీ ద్వేషిగా మారిన ఈ సైకో పేరు రాంబాబు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

ఇలా విశాఖ సిటీలో సైకోలు రౌడీ షీటర్లు వీర విహారం చేస్తున్నారు. ఇక నడి రోడ్డు మీద హత్యలతో జనాలను బెంబేలెత్తిస్తున్నారు. దీన్ని చూసిన వారు ఈ విశాఖకు ఏమి దౌర్భాగ్యం పట్టుకుంది అని కలవరపడుతున్నారు. 

విశాఖలో రౌడీ షీటర్ల హల్ చల్ ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం ఉన్నా పట్టనట్లుగా వ్యవరిస్తున్నారన్న విమర్శలు ఉన్న నేపధ్యంలో ఇక మీదట అయినా లా అండ్ ఆర్డర్ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.