ఈ నెలలోనే వస్తున్న మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు రంగ్ దే. నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. విడుదల దగ్గరకు వచ్చేయడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లోకి తీసుకువచ్చారు.
19న కర్నూలులో ట్రయిలర్ లాంచింగ్ ఫంక్షన్. ఆ తరువాత విడుదలకు రెండు మూడు రోజులు ముందుగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకుడు త్రివిక్రమ్ హాజరవుతారని తెలుస్తోంది. నితిన్ ఫ్యావరెట్ పవర్ స్టార్ వస్తారా? రారా? అన్నది చూడాలి. ఈ సినిమా కోసం ఈటీవీ, జీటీవీ భారీగా రంగుల హోళీ కార్యక్రమాలు చేసాయి. రానా హోస్ట్ గా నెంబర్ వన్ య్యారీ చాట్ షో చేసారు.
భీష్మ తరువాత నితిన్ సేమ్ బ్యానర్ లో చేస్తున్న రెండో సినిమా ఇది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు వెంకీ అట్లూరికి ఇది మూడో సినిమా.