రాజేంద్ర ప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించి గాలి సంపత్ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఓటిటి ప్లాట్ ఫారమ్ దక్కించుకుంది.
రెండు కోట్ల మొత్తానికి ఈ రైట్స్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు ఏడున్నర కోట్ల బడ్జెట్ తో నిర్మించిన గాలిసంపత్ అయిదుకోట్ల మేరకు థియేటర్ హక్కులు విక్రయించి, విడుదల చేసారు. కానీ పాజిటివ్ రెస్సాన్స్ రాలేదు.
దాంతో విడుదల తరువాత మంచి రేటు వస్తుందనుకున్నది కాస్తా ఆగిపోయింది. నిజానికి డిజిటల్, శాటిలైట్ కలిపి అయిదు కోట్లకు పైగా రేటుకు విక్రయిద్దామని మేకర్లు అనుకున్నారు.
కానీ ఇప్పుడు అంత వచ్చేలా లేదు. ఆహా నుంచి రెండు కోట్లు వస్తోంది. శాటిలైట్ డీల్ డిస్కషన్ లోవుంది అది ఎంత వస్తుందో చూడాలి. సినిమా కనీసం యావరేజ్ అనిపించుకున్నా డీల్ వేరేగా వుండేది.
కానీ మూడు సినిమాల మధ్య విడుదలయిన గాలిసంపత్, బాక్సాఫీస్ దగ్గర మరీ నీరసమైన ఫలితాలు నమోదు చేయడం వల్ల మేకర్ల ప్లాన్ నెరవేరలేదు.