తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ మేరకు తమ అభ్యర్థిగా ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు.
తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఘన విజయం సాధించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ రాబోతున్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించి కేసులన్నీ క్లియర్ అయిన నేపథ్యంలో ఎస్ఈసీ వెంటనే జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
అన్ని ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలోనే పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని, ఈ ఎన్నికలు పూర్తి చేస్తే తాము వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు.