నిరూపిస్తే రాజీనామా…మ‌రోసారి స‌వాల్‌!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ఆశ‌ల‌పై మంత్రి కేటీఆర్ నీళ్లు చ‌ల్లారు. నిర్ణీత స‌మ‌యానికే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  Advertisement కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.…

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ఆశ‌ల‌పై మంత్రి కేటీఆర్ నీళ్లు చ‌ల్లారు. నిర్ణీత స‌మ‌యానికే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ చేసిన స‌ర్వేలు వ‌రుస‌గా నిన్న‌, మొన్న విడుద‌ల‌య్యాయ‌న్నారు. వాటిలో కూడా రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్సే అధికారంలోకి వ‌స్తుంద‌ని తేలింద‌న్నారు.

2023లోనే తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు. 90కి పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ వ‌స్తుందంటున్న బీజేపీ నేత‌లు అంటున్నార‌న్నారు. డ‌బుల్ ఇంజ‌న్ అంటే మోడీ, ఈడీ లేకపోతే జుమ్లా, హమ్ల అంటూ సెటైర్లు వేశారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్రజాదరణ నాయకులకే  టికెట్ లు ఇస్తామన్నారు. కేసీఆర్ ఎవరికి లొంగడు.. భయపడడని తేల్చి చెప్పారు.  

తమ ఐడియాలజీ నచ్చిన వారు ఎప్పటికీ టీఆర్ఎస్‌తోనే  ఉంటారన్నారు. రానున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఓడిన‌ తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా ఎవరైనా ఉంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించడాన్ని కూడా అన్ పార్లమెంటరీ అంటే వర్డ్ అంటే ఎలా అని ఆయ‌న నిల‌దీశారు.

కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూపాయి అయితే.. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చేది 40 పైసలు మాత్రమేనన్నారు. ఇది నిజం కాదని ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ మ‌రోసారి సవాల్ విసిరారు. మోదీ ప్రయివేట్ విజిట్‌ల‌కు తాము ఎందుకు రిసీవ్ చేసుకుంటామని ప్ర‌శ్నించారు. మోదీ దేశానికి కాదు.. గుజరాత్‌కు ప్రధాని అంటూ కేటీఆర్ పంచ్ విసిరారు.