వ‌ల‌పు విసిరి..లేడి లూఠీ

ప్రేమ‌, పెళ్లితో పాటు ఇత‌రేత‌ర మోసాల‌తో జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్న మాయ‌లేడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగా డ‌బ్బున్న వ్యాపారులు, పెద్ద‌పెద్ద ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కుల‌ను టార్గెట్ చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న యువ‌తి బాగోతాలు…

ప్రేమ‌, పెళ్లితో పాటు ఇత‌రేత‌ర మోసాల‌తో జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్న మాయ‌లేడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగా డ‌బ్బున్న వ్యాపారులు, పెద్ద‌పెద్ద ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కుల‌ను టార్గెట్ చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న యువ‌తి బాగోతాలు విజ‌య‌వాడ‌లో వెలుగు చూశాయి.

ఇందులో భాగంగా ఓ యువ‌కుడిపై ప్రేమను కురిపించి…సుమారు రూ.80 ల‌క్ష‌లు కొట్టేసింది. చివ‌రికి తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన స‌ద‌రు బాధిత యువ‌కుడి ఫిర్యాదుతో శ్రీ‌దివ్య అనే యువ‌తి మోసాలు వెలుగులోకి వ‌చ్చాయి. క‌న్నింగ్ లేడీతో పాటు స‌హ‌క‌రిస్తున్న ఆమె త‌మ్ముడు పోతురాజు, ర‌జాక్‌ల‌ను కూడా ఇబ్ర‌హీం ప‌ట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచార‌ణ‌లో శ్రీ‌దివ్య ముఠా ఆగ‌డాలు మ‌రిన్ని వెలుగు చూస్తున్నాయి.  విజ‌య‌వాడ‌లోని ఓ ప్ర‌ముఖ న్యాయ‌వాది పేరు తో భూదందాల‌కు తెగ‌బ‌డుతున్న‌ట్టు తెలిసొచ్చింది. వివాదాల్లో ఉన్న భూముల‌ను విడిపిస్తామంటూ బాధితుల నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం, ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోవ‌డంతో బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

అలాగే విజ‌య‌వాడ‌లో ఓ కార్పొరేట‌ర్‌, హోట‌ల్ య‌జ‌మానితో పాటు సాప్ట్‌వేర్ ఉద్యోగితో పాటు ప‌దుల సంఖ్య‌లో మాయ‌లేడి వల‌లో చిక్కుకుని జేబులు ఖాళీ చేసుకున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. లోతుల్లోకి వెళితే మ‌రిన్ని మోసాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని ఇబ్ర‌హీం ప‌ట్నం పోలీసులు భావిస్తున్నారు. 

కేవ‌లం ఒక్క యువ‌కుడి నుంచే రూ.80 ల‌క్ష‌లు వ‌సూలు చేశారంటే, ఇక ప‌దుల సంఖ్య‌లో బాధితుల మ‌రెంత భారీ మొత్తంలో దోచుకుని ఉంటుందో అనే ఆలోచ‌న‌తో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.