ఎదురు చూస్తున్నారు… త్వ‌ర‌గా తేల్చండి

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం నివాసి ఆనంద‌య్య పంపిణీ చేస్తున్న మందుపై హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. ఆనంద‌య్య మందు కోసం ప్ర‌జానీకం ఎదురు చూస్తోంద‌ని, వీలైనంత త్వ‌ర‌గా నివేదిక‌లు తెప్పించి తేల్చాల‌ని హైకోర్టు కోరింది. …

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం నివాసి ఆనంద‌య్య పంపిణీ చేస్తున్న మందుపై హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. ఆనంద‌య్య మందు కోసం ప్ర‌జానీకం ఎదురు చూస్తోంద‌ని, వీలైనంత త్వ‌ర‌గా నివేదిక‌లు తెప్పించి తేల్చాల‌ని హైకోర్టు కోరింది. 

ఆనంద‌య్య త‌యారు చేసే ఆయుర్వేద మందు వ‌ల్ల క‌రోనా క‌ట్ట‌డ‌వుతోంద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ మందు శాస్త్రీయ‌త‌, ఇత‌ర‌త్రా దుష్ప్ర‌భావాలేమైనా వ‌స్తాయా? అనే అంశాల్ని నిగ్గు తేల్చేందుకు ప్ర‌భుత్వం అధ్య‌య‌నం చేప‌ట్టింది.

మ‌రోవైపు ఆనంద‌య్య మందు పంపిణీకి ఆదేశించాల‌ని దాఖ‌లైన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది స్పందిస్తూ ….ఆనంద‌య్య మందుపై ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నామ‌న్నారు. ఈ నెల 29 నాటికి ఆనంద‌య్య మందుపై నివేదిక‌లు వ‌స్తాయ‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం వివ‌రించింది. 

హైకోర్టు స్పందిస్తూ …ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి? మందుపై అభిప్రాయం ఏంటో? త‌మ‌కు తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఆనంద‌య్య మందు వ్య‌వ‌హారంపై కేంద్ర ప్ర‌భుత్వం త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తే వెంట‌నే మందు త‌యారీని స్టార్ట్ చేస్తామ‌ని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం ఎంత త్వ‌రగా స్పందిస్తే, మందు త‌యారీ ఊపందుకుంటుంది.