ఓటీటీలోకి మరో హీరోయిన్

సినిమాల్లో అవకాశాలు తగ్గి కాస్త ఇబ్బంది పడుతున్న హీరోయిన్లంతా వరుసపెట్టి ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది. దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ బ్యూటీ,…

సినిమాల్లో అవకాశాలు తగ్గి కాస్త ఇబ్బంది పడుతున్న హీరోయిన్లంతా వరుసపెట్టి ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది. దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ బ్యూటీ, ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేసింది.

పులి-మేక అనే వెబ్ సిరీస్ చేసేందుకు అంగీకరించింది లావణ్య త్రిపాఠి. కోన వెంకట్ ఈ సిరీస్ కు కథ అందించగా.. చక్రవర్తి దర్శకత్వం వహిస్తాడు. ఇంతకుముందు గోపీచంద్ హీరోగా నటించిన పంతం సినిమాకు ఇతడే దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోంది లావణ్య త్రిపాఠి.

పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకర్ని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ కథే ఈ మేక-పులి. థ్రిల్లర్ అంశాలకు జాతకాల్ని కూడా మిక్స్ చేసి రాసిన డిఫరెంట్ స్టోరీ ఇది. ఇదే వెబ్ సిరీస్ తో హీరో ఆది సాయికుమార్ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు.

ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ తో పాటు సీనియర్ నటుడు సుమన్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటిస్తోంది లావణ్య త్రిపాఠి. ఈ మూవీ తప్ప ఈమె చేతిలో మరో ప్రాజెక్టు లేదు.