జూన్ 24న పెళ్లికూతురు పార్టీ

ప్రిన్స్‌ అర్జున్ క‌ళ్యాణ్, అనీషా ధామా, సీత‌, జ‌య‌త్రీ, సాయికీర్త‌న్‌, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మించారు. అప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది.…

ప్రిన్స్‌ అర్జున్ క‌ళ్యాణ్, అనీషా ధామా, సీత‌, జ‌య‌త్రీ, సాయికీర్త‌న్‌, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మించారు. అప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫిలింఛాంబర్ లో జ‌రిగిన పాత్రికేయుల సమావేశంలో తెలియ‌జేశారు.

దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ ఇది అమ్మాయిల‌క‌థ‌. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో క‌థ చెప్పాను. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే సినిమా అన్నారు.  ప్రిన్స్ మాట్లాడుతూ ఫ్యామిలీతో వ‌చ్చి న‌వ్వుకునే సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ సీత మాట్లాడుతూ, నేను యూట్యూబ్ ద్వారా అందరికీ తెలుసు. దాని వ‌ల్లే నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ క‌థ‌. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమా అన్నారు. 

నిర్మాత ఎ.వి.ఆర్‌. స్వామి మాట్లాడుతూ, మా ట్రైల‌ర్ బాగా న‌చ్చి పి.వి.ఆర్‌. సినిమాస్ స‌పోర్ట్ చేశారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఏషియ‌న్స్ వారు కూడా మంచి స‌పోర్ట్ చేస్తున్నారు. జూన్ 24న విడుద‌ల‌వుతున్న మా సినిమాకు అంద‌రి స‌పోర్ట్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.