ఓటీటీలోకి ఉప్పెన హీరో?

ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈమధ్య కాలంలో ఇదే పెద్ద విజయం. దీంతో వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని దర్శక-నిర్మాత క్రిష్…

ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈమధ్య కాలంలో ఇదే పెద్ద విజయం. దీంతో వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని దర్శక-నిర్మాత క్రిష్ బాగా క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. ఉప్పెన వచ్చి వెళ్లిన మినిమం గ్యాప్ లో, వైష్ణవ్ తేజ్ తో తీసిన సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ సెకెండ్ వేవ్ క్రిష్ ఆశలపై నీళ్లు చల్లింది.

కొండపొలం అనే నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ సినిమా తీశాడు క్రిష్. లాక్ డౌన్ టైమ్ లో 40 రోజుల్లోనే, వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. అదే టైమ్ లో రకుల్ కరోనా బారిన పడడం, తిరిగి కోలుకోవడం అన్నీ జరిగిపోయాయి.

ఇప్పుడా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. రిలీజ్ చేద్దామంటే థియేటర్లు బంద్ అయ్యాయి. పోనీ వెయిట్ చేద్దామంటే, ఉప్పెన క్రేజ్ తగ్గిపోతుందేమోనని భయం. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నాడు క్రిష్. ఈ మేరకు పలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి ఆహా సంస్థ ముందువరసలో ఉంది.

ఏదైనా ఓటీటీతో డీల్ సెట్ అయిన తర్వాత ప్రమోషన్ ప్రారంభించాలనుకుంటున్నాడు క్రిష్. అందుకే సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. త్వరలోనే వైష్ణవ్ తేజ్ రెండో సినిమాపై క్లారిటీ రానుంది.